28.7 C
Hyderabad
April 24, 2024 03: 14 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి ఆలయంలో వైభ‌వంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ

#Garuda Seva

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం సాయంత్రం మాఘ మాస పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతాం

Satyam NEWS

ఘనంగా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు

Satyam NEWS

ముహూర్తం ఫిక్స్: ఆగస్టు 13న విశాఖకు జగన్

Satyam NEWS

Leave a Comment