హైదరాబాద్ లోని గోల్నాక డివిజన్ పరిధిలోని మారుతీ నగర్ బస్తిని అనుకొని ఉన్న ఆసిడ్ కంపనీలో ప్రమాదవశాత్తు రియాక్టర్ లీక్ కావడం ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేసింది.
ప్రక్కనే ఉన్న బస్తిలోకి గ్యాస్ వ్యాప్తి చెందడంతో దీని ప్రభావంతో ఏం జరుగుతుందోనని బస్తీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వెంటనే స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య గౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు భరత్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి భూపతి లక్ష్మణ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
బస్తీ వాసులు భయాందోళనకు గురికాకుండ వారికి దైర్యం చెప్పారు. వెంటనే అధికారులతో మాట్లాడి గృహ నివాసాల మధ్య నడుస్తున్న రసాయన కంపెనీను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ లు సీజ్ చేయించారు.