గీత జయంతి పురస్కరించుకొని డిసెంబర్ 14 న హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో లక్ష మందితో భగవద్గీత పారాయణం ఏర్పాటు చేశారు. 15 నుండి 40 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు ఒకే సారి భగవద్గీత లోని 40 శ్లోకాలు ఆలపించేందుకు సన్నద్ధమౌతున్నారు. ఇంత మంది భగవద్గీత పారాయణం చేయడం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవుతుంది.
అందువల్ల గిన్నిస్ బుక్ లో ఈ కార్యక్రమాన్ని నమోదు చేసేందుకు ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఈ మహత్తర కార్యక్రమం పోస్టర్ ను నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని మాధవ స్వామి దేవాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ నాయకులు బాబు రావు, బజరంగ్దళ్ జిల్లా అధ్యక్షులు బొమ్మరిల్లు భాస్కర్, రమేష్, యాదవ సంఘం నాయకులు బాలయ్య యాదవ్, భాస్కర్ యాదవ్, మల్లికార్జున యాదవ్, రాము యాదవ్, వేణుగోపాల్, సత్యనారాయణ, చంద్రయ్య, రామస్వామి, విష్ణుమూర్తి యాదవ్ తదితరులు హాజరయ్యారు.