తిరుమలలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఇప్పటి వరకూ 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దాంతో అక్కడి ఐదు జలాశయాలు నిండిపోయాయి. పాపవినాశనం, గోగర్భం డ్యాం గేట్లను ఎత్తివేశారు. ఆకాశగంగ, కుమార ధార పసుపు ధార జలాశయాల నుంచి వర్షపు నీరు ఒవర్ ప్లో అవుతున్నది. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి తిరుపతి ప్రయాణించే ఘాట్ రోడ్ ను మూసివేశారు. భారీ వర్షాల కారణంగా మొదటి ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఈ కారణంగా రాత్రి 7 గంటల నుండి తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే ఘాట్ రోడ్ లో రాకపోకలు నిషేధించారు.
previous post