తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత, సీఎం కేసీఆర్ అధ్యకతన తెలంగాణ మంత్రి మండలి శుక్రవారం కీలక భేటీ నిర్వహించనుంది. ఈ భేటీలో మంత్రి మండలితో సహా పలువురు కీలక అధికార, అనధికార (ఇంటెలిజెన్స్) గణం కూడా పాల్గొననున్నట్లు సమాచారం.
కీలక నిర్ణయాలేనా?
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి శుక్రవారం సమావేశం కానుంది. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్లో ఈ భేటీ జరగనుంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుందని తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం తొలిసారి మంత్రిమండలి సమావేశం ఏర్పాటు కావడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. దుబ్బాక ఫలితాలపై ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో సీఎం చర్చిస్తారు.
పరిణామాలపై చర్చ?
ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపైనే కాకుండా ఇటీవల దుబ్బాక ఎన్నికల పరిణామాలు, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ, కార్పొరేషన్ల టిక్కెట్ల కోసమేనా?
అంతేగాకుండా నిరుపేదలకు నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎంతమేర లాభం చేకూరుస్తున్నాయి… అనధికారులు ఎంతమేర లాభం పొందుతున్నారు.. ఆయా డివిజన్ల వారీగా (సూక్ష్మంగా) లెక్కల్లో తేల్చి, అనంతరం కార్పొరేషన్లు, ఎమ్మెల్సీల వారీగా టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్లు కేటాయించనుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
లాభ-నష్టాలు..
దుబ్బాకలో లక్ష మెజార్టీ అని ప్రకటించుకున్న అధికార పక్షం కాస్త బోల్తా కొట్టడం… కరోనా, వరదముంపు సహాయం.. దీపావళిపై కోర్టు తీర్పు తదితర అంశాల వారీగా పార్టీకి చేకూరే లాభనష్టాలను బేరీజు వేసుకునే అంశాలపైనే ఈ భేటీ జరగనుందని సమాచారం..
ధరణి నేపథ్యంలో కూడా భేటీకి ప్రాధాన్యత..
ధరణి సేవలు ప్రజలకు ఏ మేరకు ఉపయోగంలోకి వస్తాయి.. ఇవి ఎంతమేరకు శ్రేయస్కరం అన్న విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహాలున్నాయి తదితర అంశాలపై కూడా కూలంకషంగా.. రాబోయే కాలంలో ఇలాంటి ఇంకా ఏం పథకాలు చేపడితే ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతారనే అంశాలపై కూడా సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం లేకపోలేదు..