నిత్యం ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఆటవిడుపులో భాగంగా ఆడిపాడారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ బ్యాడ్మింటన్ విభాగంలో మొదటి రౌండ్ లో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత పై, రెండో రౌండ్ లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పై మూడో రౌండ్లో చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత పై గెలుపొంది ఫైనల్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ క్రీడలు ప్రజాప్రతినిధుల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఆటలో గెలుపోవటములు సహజమని అన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో విక్టరీ ప్లే గ్రౌండ్ లో మూడురోజుల పాటు నిర్వహించబోయే కార్పొరేటర్ల స్పోర్ట్స్ మీట్ 2023 కార్యక్రమం గురువారం సందడిగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్పొరేటర్లు ఓకే వేదికపై వివిధ పోటీల్లో పాల్గొన్నారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తోటి మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి సరదాగా క్యారమ్స్, చదరంగం ఉత్సాహంగా ఆడారు.
previous post