30.7 C
Hyderabad
April 24, 2024 00: 32 AM
Slider ప్రకాశం

తక్కువ ధరకే బంగారం ఇస్తామంటే నమ్మి మోసపోకండి

#giddaluru

ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్ పరిధిలో ఎవరైనా బంగారం వ్యాపారం పేరిట తక్కువ ధరకే బంగారం ఇస్తామంటే నమ్మి మోసపోవద్దని గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ ప్రజలను హెచ్చరించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ మాట్లాడుతూ..ఇటీవల గిద్దలూరు పట్టణంలో తక్కువ ధరకే బంగారం ఇస్తామని కొందరు నమ్మబలికి మోసగిస్తున్నారని ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు.స్థానిక బంగారం మార్కెట్ లో గాని అంతర్జాతీయ మార్కెట్లో కానీ బంగారం ధర అటు ఇటుగా ఒకే విధంగా ఉంటుందని ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని అన్నారు.

తక్కువ ధరకే బంగారం ఇస్తామని మోసగించేవారు మొదట కొంత మొత్తంలో బంగారం ఇచ్చి తరువాత ప్రజల వద్ద భారీగా నగదును సేకరించిన  వారు ఉదాయించడం మోసగించడం జరుగుతుందని బంగారం అమ్మే వర్తకులు కూడా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ఇటువంటి మోసాలు ఇతర ప్రాంతాల్లో జరిగాయని ఈ విషయం ప్రజలు గమనించాలని అన్నారు.కాబట్టి ప్రజలు అటువంటి మోసాలకు ఉరికాకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎవరైనా తక్కువ ధరకే బంగారం ఇస్తామని మోసగించేందుకు ప్రయత్నిస్తే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

ఘనంగా శ్రీ పురంధరదాసు ఆరాధనోత్సవాలు

Satyam NEWS

నిర్భయంగా ఓటు వేయండి

Sub Editor

సెల్ఫీ ఛాలెంజ్: మాడుపగిలే ఎండలోనూ… అశోకుని సాహసం

Satyam NEWS

Leave a Comment