మరో మూడేళ్ళ లో మహాకవి వందేళ్ల క్రితం రచించిన “కన్యాశుల్కం”..వచ్చే పరిస్థితి పొంచి ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి సందేహం వ్యక్తం చేసారు. ప్రస్తుతం జిల్లా లో ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అలాగే గురజాడ వర్ధంతి నేపథ్యంలో వేర్వేరు భావాలు పక్కన పెట్టి… ఓ మానవతా వాదిగా గురజాడ వేంకట అప్పారావు ను చూడాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఆయన పేరు మీద ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు గారికి ఇవ్వడం.. వెలకట్టలేనిదని కలెక్టర్ అన్నారు. ప్రస్తుత ఈ ఆధునిక కాలంలో ఆ కలియుగ ఆధునిక సాహిత్య వైతాళికుడిని…ఆయన చేసిన రచనలు ద్వారా సమాజంలో సమానత్వంతో పాటు దేశ భక్తి ని ప్రతీ ఒక్కరూ అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూర్య కుమారి అన్నారు.
previous post