ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలో బాలల రక్షణ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ బాలల హక్కులను రక్షించడం మనందరి బాధ్యతలని వారికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సరైన మార్గ నిర్దేశం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లికార్జున్ ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు ఆర్బిఎస్కే ఏఎన్ఎం లు సుభాషిని, తిరుపతమ్మ ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.