35.2 C
Hyderabad
April 20, 2024 18: 02 PM
Slider నిజామాబాద్

ప్రమాదం అంచున బిచ్కుంద హాస్టల్ భవనం

girls hostal

కామారెడ్డి జిల్లా బిచ్కుంద  మండల కేంద్రంలోని బాలికల కళాశాల హాస్టల్ భవనం కు ఓ విద్యుత్తు స్తంభం హాస్టల్ భవనం లోపలి నుండి ఆనుకుని ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవించినా  హాస్టళ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఈ భవన నిర్మాణ సమయంలో యాజమాని విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాలు పాటించకుండా నిర్మాణం చేపట్టారు.

దీంతో రోడ్డుపైన ఉన్న స్తంభాన్ని తన భవనంలో కలిపి నిర్మించడం అయిన నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. కానీ ఇప్పుడు ఆ భవనం బాలికల హాస్టల్ కు అద్దెకు ఇవ్వడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరిగిన నష్టపోయేది విద్యార్థినులే కావున విద్యుత్ శాఖ అధికారులు స్పందించి హాస్టల్ కు ఆనుకుని ఉన్న స్తంభం నుండి వైర్లను వేరుచేసి మరో స్తంభాన్ని ఏర్పాటు చేసి ప్రమాదం జరగకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు.

Related posts

ఇడుపులపాయకు చేరిన ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

కోతుల సామూహిక మరణం: విషప్రయోగమే కారణమా?

Bhavani

ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు

Satyam NEWS

Leave a Comment