ఆరేళ్ళ చిన్నారి చైత్ర మరణానికి కారణమైన హంతకుడికి ఉరిశిక్ష విధించాలని అలాగే బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విదాలు ఆదుకోవాలని హప్సిగూడ కార్పోరేటర్ కక్కిరేని చేతనహరీష్ అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం కార్పోరేటర్ చేతనహరీష్ ఆధ్వర్యంలో హప్సిగూడ డివిజన్లోని స్ట్రీట్ నెంబ 8 స్వాతి టిఫిన్ సెంటర్ నుండి గాంధీ గిరిజన బస్తీ వరకు కొవ్వత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా కార్పోరేటర్ మాట్లాడతూ చిన్నారి చైత్ర మరణానికి కారణమైన హంతకుడికి వెంటనే ఉరిశిక్ష విధించాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కక్కిరేణి హరీష్, కన్వీనర్ శ్రీనివాస్చారి, బీజేపీ నాయకులు రాష్ట్ర ఎస్టీ మోర్చా పండిత్యనాయక్, రాష్ట్ర ఓబీసి సోమశేఖర్, న్యాలకొండ సుమన్రావు, జిల్లెల రవీందర్రెడ్డి, రంగ ,రవి,కైలాసపతిగౌడ్, బండి పద్మ, ప్రవీణ్, నందునాయక్, పండునాయక్, ఎల్లాచారి, నికిత, మహేందర్, రమేష్నాయక్, కనవత్రాజు, శివగౌడ్, సురేష్, లక్ష్మిజ్యోతి, అంజలి కాలనీ వాసులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.