39.2 C
Hyderabad
April 25, 2024 15: 47 PM
Slider ప్రత్యేకం

జ్ఞాన దీప్తి మనలను వదిలేసి అమరలోకానికి వెళ్లిపోయింది

#Gnanadeepti

తీవ్ర అనారోగ్యంతో వైద్య ఖర్చుల కోసం ఎవరు సాయం చేస్తారా అని ఎదురుచూసిన జ్ఞాన దీప్తి మనలను వదిలేసి అమరలోకానికి వెళ్లిపోయింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు లోని మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసరావు కుమార్తె జ్ఞాన దీప్తి కి కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యం ఏర్పడింది. ఇన్ ఫెక్షన్ కావడంతో రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.

దాని వలన లివర్, ఊపిరితిత్తులు, గుండె కూడా డ్యామేజ్ అయింది. దగ్గు,ఆయాసం, నిద్ర పట్టక పోవడం శ్వాస యిబ్బంది ఏర్పడింది. తల్లిదండ్రులు ఆమె జబ్బు లక్షణాలు తెలియక ముందు చెస్ట్ హాస్పటల్ లో చికిత్స చేయించారు. తర్వాత MD డాక్టర్ దగ్గర చూపించారు.

రోజు రోజుకీ పరిస్థితి విషమించడం వలన డాక్టర్లు హైదరాబాద్ తీసుకువెళ్ళమన్నారు. వెంటనే పాపను హైదరాబాద్ తీసుకువెళ్ళారు. అక్కడ నిమ్స్ హాస్పటల్ లో చేర్చితే వాళ్ళు వెంటిలేటర్ లేదు పాప పరిస్థితి బాగాలేదు తొందరగా వెంటిలేటర్ పెట్టకపోతే పాప చనిపోతుంది అన్నారు అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి చేతిలో డబ్బులు లేవు.

పాప ను చూస్తే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి డబ్బులు ఎక్కువ అయినా ప్రవేట్ హాస్పటల్ కేర్ లో చేర్పించారు. పాప తండ్రి సామాన్య డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్ లో డబ్బులు పెట్టలేక హన్మకొండ SVR మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ చేర్పించారు.

20 రోజులు పైగా వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తూ డయాలసిస్ చేయాలి అని డాక్టర్లు అన్నారు. ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించడానికి తండ్రి దగ్గర డబ్బులు లేవు.

దాంతో ఈ విషయాలన్నీ సత్యం న్యూస్ వెల్లడించింది. సహాయం అందించిన వివరాలు అందించింది…….

అయితే… ఇప్పుడు ఆ పాప మనతో లేదు…… తుది శ్వాస తీసుకున్నది. ఈ పాడులోకాన్ని వదిలి అమర లోకాలకు వెళ్లిపోయింది….. స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి…..

సారీ…. శ్రీనివాసరావు

Related posts

యానిమల్ వెల్ఫేర్: పశు సంపద పెంచేందుకు చర్యలు

Satyam NEWS

దళితుల స్వావలంబన కోసమే దళిత బంధు పథకం

Satyam NEWS

ప్రాణ‌వాయువు కొర‌త తీరిపోయింది: విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన‌…!

Satyam NEWS

Leave a Comment