317 జీవో లో సవరణలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు పర్వతం సంధ్యా రాణి,యామా రమేశ్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైది రెడ్డి కి వినతిపత్రం అందచేశారు.
శుక్రవారం హుజూర్ నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ఆశాస్త్రీయమైనదని,ఈ జీ వో వలన ఎంతోమంది ఉద్యోగ,ఉపాధ్యాయులు తీవ్ర మనో వేదనకు గురి అవుతున్నారని వివరించారు. జీవో ను సవరించి స్థానికత ప్రధమ ప్రాదాన్యతగా తీసుకొని ఎవరి స్వంత జిల్లాకు వారిని సర్దుబాటు చేయాలని వారు కోరారు.
భార్యాభర్తల బదిలీల విషయంలో అన్ని జిల్లాలకు అవకాశం ఇవ్వాలని, 40% పైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు,వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్ రావు,గెల్లి రవి, చిట్యాల అమర్ నాధ్ రెడ్డి,తపస్ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవరం శ్రీధర్ రెడ్డి, జిల్లా నాయకులు కీత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్