సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో వెలసిన శ్రీ శాల్మలీ కంద ఆదివరహా లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రతంలో భాగంగా శుక్రవారం గోదా కల్యాణం సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి సుప్రభాత సేవ,ఆరాధన,ఆరగింపు, మంగళాశాసనం,తీర్ధప్రసాద వినియోగం జరిగినది.
అనంతరం శ్రీ గోదా రంగనాథుని (వేణుగోపాల) స్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా,వీనుల విందుగా ప్రభుత్వ జీవోను అనుసరించి కోవిడ్ -19 నియమ నిబంధనలకు లోబడి ఆంతరంగికంగా దేవాలయంలో అర్చకులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొత్త నాగరాజు,కార్యనిర్వహణాధికారి యం.పి.లక్ష్మణ్ రావు స్థానాచార్యులు శ్రీనివాస చార్యులు,అర్చకులు హరీష్ కుమారాచార్యులు,మనోహరాచార్యులు ధర్మకర్తల మండలి సభ్యులు కాసాని గోపాలం,బుద్దే మట్టపల్లి,యరగాని వెంకటేశ్వర్లు,పొదిల సైదులు,వేముల గురుస్వామి,కస్తాల సైదమ్మ,దేశముఖ్ అరుణ్ కుమార్,శీలం కృష్ణ,కాల్వ రంగారావు,మిట్టపల్లి శ్రీనివాస్, వేణుగోపాల్,ఆలయ సిబ్బంది, కొండారెడ్డి,కిరణ్.రమేష్,ఉపేందర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్