నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం శ్రీ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోధాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి సతీ సమేతంగా గోధాదేవి కళ్యాణ వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కు ఆలయ పూజారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరినీ పలకరించారు.
ప్రజలందరూ సుఖశాంతులతో, పాడిపంటలతో సంతోషంగా ఉండాలని ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రఘుప్రొలు విజయలక్ష్మి చంద్ర శేఖర చారి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జి నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.