బంగారం విలువ పెరగడం తో దాని దొంగతనానికి ప్రాణాలకు తెగిస్తున్నారు కొందరు.ముఖ్యం గా గల్ఫ్ దేశాల నుండి వాటిని ఇండియా కు తరలించడానికి కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు.ఇందులో ఒక మార్గాన్ని ఎంచుకుని అధికారులకు చిక్కిన విధానమిది. ముగ్గురు వ్యక్తులు బంగారం పేస్ట్ను క్యాప్సూల్స్గా మార్చి మలద్వారంలో పెట్టుకుని వస్తున్నట్లు గుర్తించి ఆపరేషన్ చేసి బంగారంబయటకు తీయించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 4,083 గ్రాముల బంగారం పట్టుబడింది. దీని విలువ రూ.1.66 కోట్లు ఉంటుందని అంచనా. వీరిలో ఒకరు పైపుల్లో దాచి బంగారం తరలిస్తుండగా, మరొకరు మైక్రోవేవ్ ఓవెన్ ట్రాన్స్ఫార్మర్లో బంగారం బిస్కెట్లు దాచాడు. పట్టుబడిన మరో మొత్తం కోటీ అరవై ఆరు లక్షల రూపాయల విలువైన 4,083 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.