25.2 C
Hyderabad
January 21, 2025 12: 36 PM
Slider ప్రత్యేకం

నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు ఇక లేరు

gollapudi

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు(80) తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుడు.

తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు.

సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Related posts

ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా పరీక్షలు చేయాలి

Satyam NEWS

ఇచ్చిన‌ హామీలన్నీ నేర‌వేర్చాను….

Satyam NEWS

హెల్తీ హార్ట్: గుండె జబ్బులు పెరగడానికి కారణాలెన్నో

Satyam NEWS

Leave a Comment