36.2 C
Hyderabad
April 25, 2024 22: 16 PM
Slider ప్రత్యేకం

నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు ఇక లేరు

gollapudi

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు(80) తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుడు.

తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు.

సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Related posts

లాక్‌డౌన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల టికెట్లకు రీఫండ్‌

Satyam NEWS

చేపల వేటకు వెళ్లిన తండ్రి కొడుకులు ఇక రాలేదు

Satyam NEWS

రాజశేఖరరెడ్డి కొడుకు అంటే విలువలు ఉంటాయనుకున్నా

Satyam NEWS

Leave a Comment