గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ గేట్లు తెరిచారు. దీంతో వస్తున్న భారీ వరద నీటి వల్ల ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసి అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారులతో కలిసి గోల్నాక డివిజన్ కార్పోరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అధికారులతో కలిసి ముప్పుగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాలు ఇబ్బందులకు గురికాకుండా చూడాల్సిందిగా ఆమె అధికారులకు తెలియచేశారు. ఒకవేళ ఏదైనా సమస్యలు జరిగితే వారికి కావలసిన ఏర్పాట్లను చేసేందుకు జిహెచ్ఎంసి అధికారులు సిద్ధంగా ఉండాలని కోరారు.
సత్యం న్యూస్, అంబర్పేట