27.7 C
Hyderabad
April 25, 2024 10: 58 AM
Slider కరీంనగర్

హుజూరాబాద్ లో కోట్లు ఖర్చు చేస్తున్న అధికార టీఆర్ఎస్

#gone prakasharao

అధికార టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చు దృష్ట్యా హుజూరాబాద్ లో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని సీనియర్ నాయకుడు గోనె ప్రకాష్ రావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఇంకా ఎక్కువ సమయం ఇస్తే ఇంకా ఎక్కువగా అధికార టీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.

కోట్ల రూపాయలు హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికార టీఆర్ ఏస్ పార్టీ ఖర్చు చేస్తోందని ఎన్నికల కమిషన్ కు ఆయన ఫిర్యాదు చేశారు.

టీఆర్ ఏస్ ఖర్చు చేస్తున్న డబ్బుల పై నిఘా పెట్టి వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరారు.

టీఆర్ ఏస్ పార్టీ అధికార దుర్వినియోగం, పోలీసు సహాయంతో టీఆర్ ఏస్ వ్యతిరేక పార్టీలపై తప్పుడు కేసులు బనాయించడం, తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలను కేంద్ర పారామిలిటరీ బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని కోరారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు, ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు.

Related posts

త్వ‌ర‌లో ల‌క్షమందితో స‌భ నిర్వ‌హిద్దాం… బ్రాహ్మ‌ణులంటే ఏమిటో చూపిద్దాం

Satyam NEWS

వేగంగా సీతారామ ప్రాజెక్ట్ రివర్ క్రాసింగ్ పనులు

Sub Editor 2

మీర్ పేట కేసులో 6గురు అరెస్ట్

Bhavani

Leave a Comment