దేశాన్ని దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ నేతలు నియంత, కుటుంబ, అరాచక పాలనతో పట్టి పీడించారని కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఏమిటో చూపించిన మహానేత అటల్ బిహారీ వాజ్ పేయి.అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
అటల్ జీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీ జెండాను నమ్ముకుని 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి వాజ్ పేయి.అని అన్నారు.50 ఏళ్లు ఎంపీగా, 5 సార్లు జాతీయ అధ్యక్షులుగా కొనసాగిన నేత వాజ్ పేయి అని అన్నారు.
డబ్బులతోనే రాజకీయాలను శాసిస్తూ పార్టీలు మారుతున్న ఈ కాలంలో కార్యకర్తలను, సిద్దాంతాలను నమ్ముకుని దేశానికి సుపరిపాలన అందించిన మహానేత వాజ్ పేయి రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల కోసం బీజేపీపై అనేక విమర్శలు చేసినప్పటికీ… నమ్ముకున్న సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటామని ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు నెరిపిన నాయకుడు వాజ్ పేయి.అని బండి కోనియాడారు.
టెలిఫోన్ వ్యవస్థను పేద వాడి వరకు చేర్చి అతి తక్కువ ధరకే సెల్ ఫోన్ సెవలు అందించిన మహా నాయకుడు వాజ్ పేయి.అని ప్రధాని అవాస్ యోజన ఇండ్ల నిర్మాణానికి ఆద్యుడు వాజ్ పేయిఅని. వాజ్ పేయి స్పూర్తితో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శక్తవంతమైన భారత్ నిర్మాణమవుతోందని బండి సంజయ్ అన్నారు.