34.2 C
Hyderabad
April 19, 2024 20: 02 PM
Slider ప్రత్యేకం

Good News: అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు

#YSRKadapa

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ లో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన ఆయన చెల్లెలు వై ఎస్ షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేలిపోయింది. దాంతో వై ఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తల్లి వై ఎస్ విజయలక్ష్మి తోడుగా అన్నా చెల్లెలు కలిసి తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డికి ఇడుపుల పాయలో నివాళి అర్పించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా ఇడుపులపాయకు విచ్చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం 9.35 గంటలకు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి డా.వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.

ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య  వైయస్ భారతి, తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల, వై ఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు జార్జిరెడ్డి భార్య భారతమ్మ ఇతర కుటుంబ సభ్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు ప్రార్థనలు చేశారు.  కోవిడ్ నేపథ్యంలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (SoP) మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సహా ప్రతి ఒక్కరికి హ్యాండ్స్ శానిటేషన్, ధర్మల్ స్క్రీనింగ్ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్యమంత్రితో పాటు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న వారిలో ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజద్ భాష, నారాయణ స్వామి, జిల్లా ఇంఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్,  ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,  తితిదే చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎంఎల్సీలు డీసీ గోవింద రెడ్డి, గంగుల ప్రభాకర రెడ్డి, కల్పలత, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పి. రవీంద్రనాథ రెడ్డి, గోరంట్ల మాధవ్,  బ్రిజేంద్రనాథ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఏ. మల్లిఖార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి తదితరులు ఉన్నారు.

జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు, ఎస్పి కేకేఎన్ అన్బురాజన్, జాయింట్ కలెక్టర్లు ఎం.గౌతమి, సి.ఎం. సాయికాంత్ వర్మ, హెచ్ఎం. ధ్యానచంద్ర, సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, ట్రైనీ కలెక్టర్ కె.మహేష్ కుమార్, ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

మీ కుటుంబ పాలనలో ఆడపడుచులు భాగం కాదా?

Satyam NEWS

పాకిస్తాన్ పిచ్చి తారాస్థాయికి చేరినట్లే ఉంది

Satyam NEWS

వసంతం అంటే

Satyam NEWS

Leave a Comment