భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటిసారి నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. వచ్చే నెల నుండి ప్రతి నెల ఒకటో తేదీనే డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం చేపడతామని ఎస్పీ డా.వినీత్ తెలిపారు . డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మొదటిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి మొత్తం 19 ఫిర్యాదులు, సమస్యలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. బాధితుల సమస్యల పరిష్కారం కొరకు వెంటనే అధికారులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ సమయంలో ఫోన్ ద్వారా తమ సమస్యలను చెప్పుకోలేని బాధితులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి నేరుగా తమని సంప్రదించవచ్చని కోరారు. ఇక నుండి ప్రతి నెల ఒకటో తేదీనే ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేసారు.
previous post
next post