27.7 C
Hyderabad
April 19, 2024 23: 47 PM
Slider ముఖ్యంశాలు

తిరుమల నడకదారిలో దేవుడిలా వచ్చి కాపాడిన షేక్ ఆర్షద్

#KadapaSpecialPolice

తిరుమల 18 వ పాదయాత్ర లో హైబీపీతో సొమ్మ సిల్లి పోయిన మండి నాగేశ్వరమ్మను భుజాలమీద దాదాపు 6 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవి మార్గమున మోసి కడప జిల్లా స్పెషల్ పార్టీ పోలీస్ షేక్ ఆర్షద్ అందరి ప్రశంసలు పొందారు.

వేలాది మంది గోవింద భక్తులతో రాజంపేట మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి బుధవారం కడప జిల్లా రాజంపేట నుంచి అన్నమయ్య కాలిబాటన తిరుమల చేరుకున్నారు. ప్రతి సంవత్సరం కాలినడకన అన్నమయ్య మార్గం ద్వారా తిరుమల పాదయాత్ర చేస్తూ ఉంటారు.

ఈసారి కూడా అన్నమయ్య మార్గం ద్వారా తిరుమల మహా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర లో నందలూరు మండలం కు చెందిన మంగి నాగేశ్వరమ్మ(58)కాలి నడకన తిరుమలకు బయలుదేరింది. మార్గం మధ్యలో గుర్రపు పాదం దగ్గరలో హైబీపీతో కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయింది.

నడవలేని స్థితి లో ఉన్న ఆమెను కడప జిల్లా స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ షేక్ అర్షద్ నాగేశ్వరమ్మను దాదాపు 6 కిలోమీటర్లు దట్టమైన అటవీ అటవీ ప్రాంతం జామాయిల్ చెట్టు దగ్గరికి రోడ్డు ఉండే మార్గం దగ్గరికి వీపుపై మోసుకుంటూ రావడం జరిగింది.

అక్కడి నుంచి వాహనం ద్వారా తిరుమల అశ్వనీ హాస్పిటల్ కు పంపడం జరిగింది.విధి నిర్వహణలో ఉన్న సమయంలో మహిళ ఇలా అనారోగ్యంతో పడిపోవడంతో కష్టం అనుకోకుండా షేక్ ఆర్షద్ సేవా దృక్పథంతో ఆమెను వీపుపై మోసుకొని సకాలంలో ఆదుకోవడం అందరి ప్రశంసలు పొందారు.

Related posts

డ్రగ్స్, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి

Satyam NEWS

మంట రగిల్చిన మంత్రి వర్గ విస్తరణ: ఒకరు ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

మునిసిపల్ కార్మికులకు పులిహోర ప్యాకెట్ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment