28.7 C
Hyderabad
April 20, 2024 07: 26 AM
Slider ముఖ్యంశాలు

నిద్ర పోతున్న జగన్ రెడ్డిని మేల్కొల్పుదాం రండి

Collage Maker-14-Jul-2022-06.05-PM

జనసేన వినూత్న కార్యక్రమం #GoodMorningCMSir

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని నిద్ర లేపాలని మరోసారి జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు విజయనగరం నియోజకవర్గంలో పాడైపోయిన రోడ్లు, గుంతల తో నిండిపోయిన రోడ్ల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని జనసేన పార్టీ పార్లమెంట్ కార్యదర్శి టీ.రామకృష్ణ పిలుపునిచ్చారు.

ఈ నెల 15,16,17 తేదీల్లో #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ తో ఫొటోలు అప్ లోడ్ చేయాలని ఆయన జనసైనికులను కోరారు. మున్సిపల్ అధికారుల సమీక్ష అనంతరం మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో జులై నెల 15 నాటికి రోడ్లపై గుంతలు ఉండవని జగన్ రెడ్డి చెప్పిన విషయాన్ని రామకృష్ణ గుర్తు చేశారు.

అధికారుల సమీక్షలో ఈ విషయం చెప్పిన జగన్ రెడ్డి ఆ తర్వాత మళ్లీ నిద్ర పోతూనే ఉన్నారని రామకృష్ణ ఎద్దేవా చేశారు. మూడు సంవత్సరాలుగా తట్ట మట్టి పోయని జగన్ రెడ్డి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకే ఈ ప్రకటన చేశారని ఇదే విషయాన్ని ఆయనకు, ఆయన పార్టీ వారికి తెలియ చెప్పేందుకు #GoodMorningCMSir క్యాంపెయిన్ చేపడుతున్నట్లు రామకృష్ణ తెలిపారు.

ఈ మాటతప్పని, మడమ తిప్పని సీఎం జగన్ రోడ్లు గుంతలు పూడుస్తామన్న సంగతి మరిచారని, నిద్దుర పోయిన ప్రభుత్వానికి, ఈ సీం కి ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా సోషల్ మీడియా దద్దరిళ్ళేటట్లు తట్టిలేపాలని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలోను, పట్టణంలోనూ రోడ్ల పరిస్థితి మరింత అధ్వాహ్నంగా మారిందని, ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తోందని, జనసేన పిలుపుతో అయినా ఆయన నిద్ర లేవాలని రామకృష్ణ తెలిపారు.

Related posts

పరిమితికి మించిన అప్పులు: ఏపికి ఇక తిప్పలు

Satyam NEWS

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఆకస్మిక మరణం

Satyam NEWS

ఎమ్మార్పీఎస్ నేత కందుల రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఆళ్ళ నాని

Satyam NEWS

Leave a Comment