గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
తాడేపల్లిలో ఆయన నివాసం నుంచి బయల్దేరి ఉదయం 11.30 గంటల సమయంలో నరసరావుపేటకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్. తొలుత మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు.
అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యం న్యూస్, నరసరావుపేట