కరోనా రోగుల్ని దోచుకుతింటున్న హైదరాబాద్ లోని సోమాజీగూడా డెక్కన్ ఆసుపత్రి కి కరోనా రోగులకు చికిత్స అందించే లైసెన్సును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు నేటి సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయినా వదలకుండా బిల్లు వసూలు చేయడం, అవసరం లేకపోయినా వెంటిలేటర్ పై ఉంచడం లాంటి ఫిర్యాదులు అనేకం ఈ డెక్కన్ ఆసుపత్రిపై వచ్చాయి.
ఆడ, మగ కరోనా రోగుల్ని ఒకే బెడ్ పై పడుకోబెట్టిన ఘనత కూడా డెక్కన్ ఆసుపత్రికే దక్కింది. మార్చురీలో కూడా కరోనా రోగుల్ని ఉంచే ప్రయత్నం చేసినట్లు డెక్కన్ ఆసుపత్రిపై ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ పెద్దలపైనే ప్రజలకు ఒక దశలో అనుమానం వచ్చింది.
కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈ విధంగా చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోణలు వినవచ్చాయి. ఎట్టకేలకు డెక్కన్ ఆసుపత్రి దోపిడికి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.