సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలో లేరని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ స్పష్టం చేశారు. అందువల్ల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్.రమేష్ కుమార్ కోరినట్లుగా ప్రవీణ్ ప్రకాశ్ పై చర్యలు తీసుకోవడం కుదరదని ఆదిత్యానాథ్ దాస్ స్పష్టం చేశారు.
ప్రవీణ్ ప్రకాశ్పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని అందువల్ల ఆదేశాలను పునఃపరిశీలించాలని నిమ్మగడ్డను సీఎస్ కోరారు. ప్రవీణ్ ప్రకాశ్ను బదిలీ చేయాలని ఆదిత్యనాథ్కు నిమ్మగడ్డ లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రవీణ్ప్రకాష్ను తొలగించకపోవడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎస్ ఆదిత్యానాథ్కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేశానని ఆయన అంగీకరించిన తర్వాత కూడా.. చర్యలు తీసుకోకపోవడం పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఎస్ఈసీ ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ అవుతుందని లేఖలో నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు.