40.2 C
Hyderabad
April 19, 2024 15: 24 PM
Slider విశాఖపట్నం

కరోనా సమయంలో ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం

#VizagCity

సరిపడినంత ఆక్సిజన్ ఉందని, వాక్సిన్ ఉందని చెబుతూ ప్రభుత్వం మోసం చేస్తున్నదని తెలుగుదేశం పార్టీ విశాఖ అర్బన్ ఉపాధ్యక్షుడు పాశర్ల ప్రసాద్ నేడు ధర్నా నిర్వహించారు.

వ్యాక్సినేషన్ కేంద్రం అయిన 98 వార్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రజలకు వాక్సినేషన్ చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యాప్ లో పేర్లు నమోదు చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దాన్ని కంట్రోల్ చేస్తున్నారని ఆయన అన్నారు.

కరోనా సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన అన్నారు.

దీనికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Related posts

ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం

Satyam NEWS

నగరి కమిషనర్ ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసా?

Satyam NEWS

నో రెన్యూవల్: హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను పునరుద్ధరించబోము

Satyam NEWS

Leave a Comment