సరిపడినంత ఆక్సిజన్ ఉందని, వాక్సిన్ ఉందని చెబుతూ ప్రభుత్వం మోసం చేస్తున్నదని తెలుగుదేశం పార్టీ విశాఖ అర్బన్ ఉపాధ్యక్షుడు పాశర్ల ప్రసాద్ నేడు ధర్నా నిర్వహించారు.
వ్యాక్సినేషన్ కేంద్రం అయిన 98 వార్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రజలకు వాక్సినేషన్ చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యాప్ లో పేర్లు నమోదు చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దాన్ని కంట్రోల్ చేస్తున్నారని ఆయన అన్నారు.
కరోనా సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన అన్నారు.
దీనికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.