ఆడవాళ్ళుకు రక్షణ కల్పించటం లో రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ అయిందని మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆరోపించారు. పోలీస్ విచారణలో ఆలశ్యం కావడం వల్లే ప్రీతి కి అన్యాయం జరిగింది. పోలీసులు నిందలు వేయటం లో ముందు ఉంటారు.. కానీ కేసులు పరిష్కారంలో చొరవ చూపడం లేదు. ప్రీతి కేస్ లో పోలీస్ లు నిద్రపోయారు. షీ టీమ్స్ పై ప్రచారం తప్ప వారు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. పోలీస్ లకే కౌన్సిలింగ్ ఇవ్వాలి..పోలీస్ లు మంత్రుల చుట్టూ తిరగకుండా.. మహిళకు రక్షణ ఇవ్వాలి అని ఆమె అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఇలాంటి ఘటన జరిగితే.. పోలీసులు ఇలానే రియాక్ట్ అవుతారా అని ఆమె ప్రశ్నించారు. మెడికల్ కాలేజ్ లు BRS గుండాల చేతుల్లో ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఇందుకేనా సోనియా గాంధి తెలంగాణ ఇచ్చింది.. ఎక్కడ బంగారు తెలంగాణ అని ఆమె ప్రశ్నించారు.
previous post