34.2 C
Hyderabad
May 19, 2025 17: 38 PM
Slider నల్గొండ

పంట కళం నిర్మాణ పనులు ప్రారంభించిన వ్యవసాయ అధికారి

#Agricultur Works

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండలం లోని రేవూరు గ్రామములో ఎర్రగుంట్ల సత్యనారాయణ రైతుకు సంబంధించిన పంట కళ్ళం నిర్మాణ పనులను వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మేళ్లచెరువు ఎం పీ డీవో ఇసాక్ హుస్సేన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎం పీ డీవో  మాట్లాడుతూ మండలంలో  రైతులు పండించిన పంటను నిలువ ఉంచుకోవడానికి ముందు ఆరబెట్టేందుకు ప్రభుత్వం ఎనౌ ఆర్ ఈ జి ఎస్  పథకం కింద కళాలు నిర్మించుటకు ఆసక్తి  ఉన్న  రైతులు వ్యవసాయ అధికారి కార్యాలయం ఉపాధి హామీ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

ఎస్ టి కేటగిరి వారికి 100 శాతం, జనరల్ కేటగిరి వారికి 90 శాతం సబ్సిడీ లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతాంగం అందరు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులతో పాటు సెక్రటరీ రామకృష్ణ ,ఏ ఈ ఓ వీర నాగరాజు పాల్గొన్నారు.

Related posts

విక్టరీ: టీఆర్ఎస్ ఆధీనంలో జనగామ మునిసిపాలిటీ

Satyam NEWS

తుంగతుర్తి నుంచి పోటీ చేస్తా

mamatha

ములుగు ఉపాధ్యాయులకు గురు స్పందన పురస్కార్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!