38.2 C
Hyderabad
April 25, 2024 14: 07 PM
Slider నల్గొండ

పంట కళం నిర్మాణ పనులు ప్రారంభించిన వ్యవసాయ అధికారి

#Agricultur Works

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండలం లోని రేవూరు గ్రామములో ఎర్రగుంట్ల సత్యనారాయణ రైతుకు సంబంధించిన పంట కళ్ళం నిర్మాణ పనులను వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మేళ్లచెరువు ఎం పీ డీవో ఇసాక్ హుస్సేన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎం పీ డీవో  మాట్లాడుతూ మండలంలో  రైతులు పండించిన పంటను నిలువ ఉంచుకోవడానికి ముందు ఆరబెట్టేందుకు ప్రభుత్వం ఎనౌ ఆర్ ఈ జి ఎస్  పథకం కింద కళాలు నిర్మించుటకు ఆసక్తి  ఉన్న  రైతులు వ్యవసాయ అధికారి కార్యాలయం ఉపాధి హామీ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

ఎస్ టి కేటగిరి వారికి 100 శాతం, జనరల్ కేటగిరి వారికి 90 శాతం సబ్సిడీ లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతాంగం అందరు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులతో పాటు సెక్రటరీ రామకృష్ణ ,ఏ ఈ ఓ వీర నాగరాజు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ పోలీసుల అదుపులో ఎవడ్రా హీరో

Satyam NEWS

బీఆర్ఎస్ లో మ‌హారాష్ట్ర నుంచి భారీ చేరిక‌లు

Bhavani

కొండగట్టు అంజన్న క్షేత్రానికి మరో రూ.500కోట్లు

Satyam NEWS

Leave a Comment