గ్రామాలలో జరిగిన ఎన్నికలలో పోటీ పడి గెలిచిన వారి వల్ల మెరుగైన నాయకత్వం వస్తుందని ఆశిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ తెలిపారు.
13,097 స్ధానాలకు ఎన్నికలు జరగగా 16% మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని ఆయన తెలిపారు. 10,890 మంది సర్పంచులు నేరుగా పోటీ చేసి ఎన్నికయ్యారని ఆయన తెలిపారు.
వీరిలో 50% మంది మహిళలు, బలహీనవర్గాల వారు ఉన్నారని ఆయన వివరించారు.
80% కంటే ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని అన్ని వర్గాల వారూ సంయమనంతో ఉండటంతోనే ఇది సాధ్యపడిందని ఆయన తెలిపారు.
పంచాయితీ ఎన్నికలలో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగలేదని ఆయన తెలిపారు.
పోలీసు సిబ్బంది వ్యాక్సినేషన్ పక్కన పెట్టి పనిచేసారని, ఆరోగ్యశాఖ కోవిడ్ నేపధ్యంలో చక్కని ఏర్పాట్లు చేసారని డాక్టర్ నిమ్మగడ్డ తెలిపారు.