కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడడం కోసం వెంటనే మొబైల్ రైతు బజార్ లను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు నిత్యావసరాలను చేరవేయాలని కేశినేని శ్వేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలోని రైతు బజార్ ప్రాంగణాన్ని ఈ రోజు సందర్శించారు.
ప్రజలలో కరోనా వైరస్ పట్ల భయాందోళనలు తొలగించడం కోసం వారికి అవగాహన కల్పించి 2000 మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తమ తమ ఇళ్లలోనే ఉండి కరోనా మీద పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎంపీ కేశినేని నాని తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.5.00 కోట్లను మంజూరు చేసిన విషయం గుర్తు చేశారు.