39.2 C
Hyderabad
March 29, 2024 15: 19 PM
Slider ఆదిలాబాద్

భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి

#BJPAsifabad

భారీ వర్షాలతో పూర్తిగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నేడు ఆసిఫాబాద్ జిల్లా చింతల మనేపల్లి మండల తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చింతలమనేపల్లి మండలం లోని అన్ని గ్రామాలలో వరి, పత్తి ఇతర పంటలు పూర్తిగా నష్ట పోయాయని వారు తెలిపారు.

నష్ట పోయిన పంటలకు సమగ్ర సర్వే నిర్వహించి ఎకరాకి 25000 రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలని  బిజెపి కోరింది.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ధోనీ శ్రీశైలం, మండల ప్రధాన కార్యదర్శి రామాగొని తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షుడు తోంబ్రే పోశన్న, మండల వైస్ ప్రెసిడెంట్ సౌమ్య,

మీడియా కన్వీనర్ మణేం మహేష్, కో కన్వీనర్ రామగిరి సంజీవ్, MRPS మండల అధ్యక్షుడు గొలెటి శంకర్ రైతులు పాల్గొన్నారు.

Related posts

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిష్ర్కమణ

Satyam NEWS

లాక్ డౌన్ తో కళ తప్పి వెల వెల బోయిన ఉగాది

Satyam NEWS

సామాజిక విద్యావంతుల న్యాయ వేదిక ములుగు జిల్లా అధ్యక్షులు గా సంద సుధాకర్

Satyam NEWS

Leave a Comment