కరోనా లాక్ డౌన్ కారణంగా చర్చిలు మూసివేసినందున చర్చి సేవకులు తీవ్ర మైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏ.సీ.ఈ.డైస్, ఎం. సి.ఎ. చర్చి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్చి బిషప్ విజయ్ మోహన్ రావు అన్నారు.
నేడు హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి క్రైస్తవులు, పాస్టర్ లు ఎంతో తోడ్పాటు అందించారని ఆయన గుర్తు చేశారు. బంగారు తెలంగాణ సాధించే దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో సహాయ పడుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆయన చర్చి సేవకులను కూడా ఆదుకోవాలని కోరారు.
ఇండిపెండెంట్ సేవకులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సేవకులకు ఉన్న ఇబ్బందులను గుర్తించి వారికి పారితోషికంగా ఐదువేల రూపాయలను అందిచడం హర్షణీయమన్నారు.