భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్ళ రైల్వే స్టేషన్ నందు అత్యాచారం హత్యకు గురైన ఇంటర్ గిరిజన విద్యార్థిని దేవిక కుటుంబానికి న్యాయం జరగాలని, హుజూర్ నగర్ నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ చావా కిరణ్మయి హుజూర్ నగర్ RDO K.వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కిరణ్మయి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి దుండగులను శిక్షించాలని, దేవిక కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని అన్నారు. దేవిక కుటుంబం పేద గిరిజన కుటుంబమని పూర్తిగా ఆదుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు సి వాణిజ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా సహదేవరావు, టిడిపి ఎస్ టి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి వెంకట్ రామ్ నాయక్ టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్, టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నలమాద శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇంకా, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు మండవ వెంకటేశ్వర్లు, తెలుగు యువత జిల్లా నాయకుడు ఎస్.కె అలీ, మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మాళోతు నాగు నాయక్, గొట్టే రాము, వాణిజ్య సెల్ పార్లమెంటు నాయకుడు సూరగాని ఆనంద్, బి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.