కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది.
తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని వారు కోరారు.
ఈ మేరకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏలూరులో ధర్నా నిర్వహించింది. ప్రతి కుటుంబానికి ఎకౌంట్లో నేరుగా 7500 రూపాయలు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు.
కరోనా కష్ట కాలంలో అందరికీ వ్యాక్సిన్ అందించాలని కెవిపిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.