ఏపీ రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు తక్షణమే విడుదల చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి ఇచ్చిన రైతులు, భూమి లేని పేదల పట్ల ప్రభుత్వం సానుభూతి చూపాలని ఆయన కోరారు. రైతులను ఇబ్బంది పెట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న వారిపై కేసుల పేరిట వేధింపులు తగవని పవన్ కల్యాణ్ అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని, పాత కేసుల పేరుతో రైతులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం తగదని ఆయన అన్నారు.
previous post
next post