ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్తుల ప్రాణాలకు విలువ లేదా అని సంఘ నాయకులు ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, సమగ్ర శిక్షా లో 100 పైగా ఉద్యోగస్తులు మరణించినా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించవలసిన ఎక్స్గ్రేషియా చెల్లించడం లేదు.
సహజంగా ఒప్పంద, పొరుగు సేవ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఆకస్మికంగా మరణించినట్లయితే అతనికి కుటుంబానికి 2 లక్షలు పైగా చెల్లించాలి. అదేవిధంగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగస్తుడు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు కుటుంబానికి అందజేయాలి.
కానీ జి.ఓ. నెంబర్ 25, ప్రకారం తేదీ 18-02-2019 ఉత్తర లోనూ వెంటనే అమలు చేయాలని, అలాగే సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తు మరణించిన ఆ ఉద్యోగస్తుడు కుటుంబం లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగస్తుల అధ్యక్షుడు ఎం.బాల కాశి, ఒక ప్రకటనలో పేర్కొన్నారు.