ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుళ్ళపల్లి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చెన్నకేశవులు పై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. అతను ఏడు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ విధంగా ఏసిబి అధికారులు దాడులు చేయడంతో ప్రకాశంజిల్లాలోని అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయంలోని ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల మండలాల్లోని అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయంలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
previous post