39.2 C
Hyderabad
March 29, 2024 14: 57 PM
Slider విజయనగరం

కాంతులీనుతున్న విజయనగరం ప్రభుత్వ కార్యాలయాలు

#lights

ఈ నెల 13 వ తేదీ నుంచీ మూడు రోజుల పాటు… ప్రతీ చోట జాతీయ జెండా ఎగురవేయాలన్న ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో..ఇప్పటికే జెండా లు ఎగురుతుండగా..తాజాగా అన్ని ప్రభుత్వ ఆఫీసులు..విద్యుత్ కాంతులతో కాంతులూనుతున్నాయి.

అందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూడు రంగుల తో దేదీప్యమానంగా కాంతులీనుతున్నాయి. ఇక ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని రైతుబజార్ లను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

అలాగే కలక్టరేట్ భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక  76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఎం.ఆర్.ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.  ఇలా ప్రతీ చోట ప్రతీ ప్రభుత్వ కార్యాలయం..ధగధగమని మెరిసిపోతున్నాయి.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు పోరాడాలి

Bhavani

నో ఎస్క్యూజ్:కూతుర్ని రేప్ చేసి త‌ల్లిని కొట్టి చంపేశారు

Satyam NEWS

సర్వే:సౌండ్ పొల్యూషన్ దేశం లో హైదరాబాదే టాప్

Satyam NEWS

Leave a Comment