ఈ నెల 13 వ తేదీ నుంచీ మూడు రోజుల పాటు… ప్రతీ చోట జాతీయ జెండా ఎగురవేయాలన్న ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో..ఇప్పటికే జెండా లు ఎగురుతుండగా..తాజాగా అన్ని ప్రభుత్వ ఆఫీసులు..విద్యుత్ కాంతులతో కాంతులూనుతున్నాయి.
అందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూడు రంగుల తో దేదీప్యమానంగా కాంతులీనుతున్నాయి. ఇక ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని రైతుబజార్ లను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
అలాగే కలక్టరేట్ భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఎం.ఆర్.ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇలా ప్రతీ చోట ప్రతీ ప్రభుత్వ కార్యాలయం..ధగధగమని మెరిసిపోతున్నాయి.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం