27.7 C
Hyderabad
April 18, 2024 09: 18 AM
Slider కరీంనగర్

డాక్టర్లు చేసే సేవతోనే ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేది

#EtalaRajendar

పేదరికం నుండి వచ్చిన వారు, పేదలకు సాయం చేయాలనే తపన ఉన్నవారే గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లుగా పని చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

గతంలో కొన్ని జబ్బులు గ్రామాల్లో ఉన్నవారికి, కష్టం చేసే వారికి రావనే భావన ఉండేది కానీ ఇప్పుడు వారికి కూడా క్యాన్సర్ లు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు వస్తున్నాయి.

ఆ ఖర్చు పెట్టలేక కుటుంబాలు ఆగం అవుతున్నాయి. అందుకే డాక్టర్లు ప్రజలకు మరింత విశ్వాసం కల్పించాలని మంత్రి కోరారు.

ప్రజారోగ్య వైద్యుల సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి నేడు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా కరోనా వారియర్ డాక్టర్ నరేష్ భార్యకు గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చినందుకు డాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేస్తున్న వైద్యులు పేదలకు వైద్యం అందిస్తున్నారని, వారు పని చేస్తేనే ప్రభుత్వం కి మంచి పేరు వస్తుందని మంత్రి అన్నారు.

డాక్టర్లకు వెహికల్ అలవెన్స్, ప్రోటోకాల్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

డాక్టర్స్ గౌరవం పెంచే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Related posts

కేంద్ర ఆర్ధిక మంత్రి రాజీనామా చేయాలి

Satyam NEWS

రైతుగా మారిన తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ ర‌మేష్ రెడ్డి

Satyam NEWS

స‌త్యంన్యూస్.నెట్ క‌థ‌నాల‌తో వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌లో సంద‌డి

Satyam NEWS

Leave a Comment