గడిచిన సంవత్సరం లాక్డౌన్ సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం కింద నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని, తక్షణమే ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం పలువూరి సభ్యులకు కరోనా వచ్చిందని తెలిసి ఆర్థికంగా యూనియన్ తరపున 15 రోజులకు సరిపడా కిరాణా సరుకులు, బియ్యం,కూరగాయలు,పండ్లు,గుడ్లు పౌష్టికాహార పదార్థాలు ఇచ్చిన సందర్భంగా రోషపతి, సోమయ్య గౌడ్ మాట్లాడుతూ హెల్పర్ బోర్డు సభ్యులు కరోనా సోకిన ప్రతి వారికి బోర్డు నుండి నుండి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందించాలని,రేషన్ ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేళ్లచెరువు సాయి,నందిపాటి సైదులు,ఉప్పతల్ల రామకృష్ణ,కానుగ వీరస్వామి,రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్