శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు బోధించిన సందేశాన్ని గుర్తుచేస్తుందని గవర్నర్ ఒక సందేశంలో చెప్పారు.
సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక పునాదని, సమాజంలో శాంతి, స్నేహం, సోదరభావం, ప్రజా శ్రేయస్సు నెలకొల్పేందుకు ఈ శుభ దినం ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ ఆకాంక్షించారు.