సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో పోలీస్ కిష్టన్న 13వ వర్దంతిని ముదిరాజ్ మహాసభ తరపున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ మత్య్సకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రైతు బంధు జిల్లా డైరెక్టర్ మేడికాయల వెంకటేశం, వైస్ ఎంపిపి కీసరి పాపయ్య, యంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్, చౌడారం సర్పంచ్ బాలయ్య లు ముఖ్యఅతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందంటే అది పోలీస్ కిష్టన్న ప్రాణత్యాగ పలితమేనని అన్నారు.
మలిదశ ఉద్యమం ఆగదని సకలజనులను ఏకం చేయడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన మహోన్నతుడు కిష్టన్న అని తెలిపారు. ఆయన వర్దంతి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరుపాలని అది ఈ అసంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు చెరుకు నారాయణ కోరమేన సుధాకర్, చెరుకు శ్రీకాంత్, ఇట్టబోయిన శేఖర్, దయ్యాల నాగరాజు, నిమ్మల బన్నీ, చంద్లాపూర్ శ్రీకాంత్, రెడ్డమేన నాగరాజు, దేశెట్టి స్వామి, గంట శ్రీనివాస్, పడిగె లింగం తదితరులు పాల్గొన్నారు.