2017వ సంవత్సరం నవంబర్ కంటే ముందు డిగ్రీ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని పాలకీడు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ దొండపాటి అప్పిరెడ్డి కోరారు.
హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు ఆయన నేడు పాలకీడు మండలంలోని మూసిఒడ్డు సింగారం,యల్లారం,పాలకీడు, సజ్జాపురం,బెటతండ, హనుమయ్య గూడెం గ్రామాలలో పర్యటించారు.
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కోసం ఆయన అందరిని సంప్రదించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మలికంటి దర్గా రావు,
పాలకీడు సహకార సంఘం చైర్మన్ యర్రడ్ల సత్యనారాయణ రెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దేవిరెడ్డి వెంకట్ రెడ్డి,తాటికొండ వెంకట్ రెడ్డి,రమావత్ రాంచందర్ నాయక్,
భోగల వెంకట్ రెడ్డి,పసుపులేటి సైదులు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.