కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని దత్త ఆశ్రమంతో పాటు కందరపల్లి గ్రామంలోని శబరిమాత ఆశ్రమంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణాల వద్ద భక్తుల సౌకర్యార్థం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
కుర్ల లో దత్త జయంతి వేడుకలు మద్నూర్ మండలంలోని కుర్ల గ్రామంలో శ్రీ ఆత్మనంద ఆశ్రమం ప్రాంగణంలో దత్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ విట్టల స్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు భారీ సంఖ్యలో జరగడంతో జాతర ఉత్సవాలు కనుల పండుగ కొనసాగాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా భక్తులకు మహానధన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు.
జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం