మనవరాలు ను చూడడానికి వెళ్తూ మార్గమధ్యంలోని బ్రిడ్జిని దాటుతూ అక్కడ ఏర్పడిన నీటి కుంటలో పడి తాత మృతి చెందిన సంఘటన ఆదివారం కడప జిల్లా వీరబల్లి మండలంలో చోటు చేసుకుంది.
రాజంపేట మండలం శేషమాంబపురం గ్రామానికి చెందిన పల్లం గంగయ్య (77) అనే వృద్ధుడు తన మనవరాలైయిన చందన అనే ఆమెను చూసేందుకు వీరబల్లి మండలంలోని తాటిగుంటపల్లి గ్రామం రెడ్డివారిపల్లి హరిజనవాడ కు వెళ్తూఉన్నాడు.
మార్గ మధ్యలోని మాండవ్య నదిని దాటుతున్న క్రమంలో బ్రిడ్జి దెబ్బతిని ఏర్పడిన నీటి గుంతలో పడి మృతి చెందినట్లు వీరబల్లి పోలీసులు తెలిపారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.