జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో శనివారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆగమపద్ధతిలో వేద పండితులు రమేష్ ఆచారి రవి శ్రీధర్ ఆధ్వర్యంలో శాస్త్రోప్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించగా పలువురు భక్తులు హాజరై ఉత్సవాలను తిలకించారు.
సంతానము లేని వారు ఈ ఉత్సవానికి హాజరై స్వామివారి ప్రసాదము స్వీకరించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను సూర్యప్రభ వాహనంలో ఊరేగించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర రావు, బాబురావు, నందిని ప్రకాష్ రావు భీమసేన చారి, సంజీవ్ భరద్వాజ్, పద్మా రెడ్డి, వాల్మీకి పూజారులు పాల్గొన్నారు.