35.2 C
Hyderabad
April 24, 2024 13: 46 PM
Slider ఆధ్యాత్మికం

ఘనంగా మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి ధ్వజారోహణం

#ShriThimmappaSwamy

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో శనివారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆగమపద్ధతిలో వేద పండితులు రమేష్ ఆచారి రవి శ్రీధర్ ఆధ్వర్యంలో శాస్త్రోప్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించగా పలువురు భక్తులు హాజరై ఉత్సవాలను తిలకించారు.

సంతానము లేని వారు ఈ ఉత్సవానికి హాజరై స్వామివారి ప్రసాదము స్వీకరించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను సూర్యప్రభ వాహనంలో ఊరేగించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర రావు, బాబురావు, నందిని ప్రకాష్ రావు భీమసేన చారి, సంజీవ్ భరద్వాజ్, పద్మా రెడ్డి, వాల్మీకి పూజారులు పాల్గొన్నారు.

Related posts

బెజవాడ వైసీపీకి మరో షాక్..

Satyam NEWS

సోమాలియాలో ఉగ్రవాదుల మారణ హోమం

Satyam NEWS

టెలిగ్రామ్ ద్వారా ఐఐటీ, నీట్ ఫోరం సేవలు

Satyam NEWS

Leave a Comment