మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసుకున్న తొలి విద్యార్థిని కావలి సువర్ణ 11వ వర్థంంతిని ఈ నెల 19న నాడు అన్ని జిల్లా,మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఆ త్యాగధనురాలికి ఘనంగా నివాళులు అర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల బతుకుల బాగుకోసం అనన్య త్యాగాలు చేసిన అమరులను స్మరిస్తూ వారి ఆశయాలను కొనసాగించడం కోసం అంతా సరికొత్త పోరాటానికి నాంది పలకాలని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన తెలంగాణ పోరుబిడ్డ, పాలమూరు మట్టిబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ కావలి సువర్ణమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి