జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రిటర్నింగ్ అధికారుల ద్వారా బుధవారం వార్డు సభ్యుల ఎన్నికలకు నోటీసు ఇవ్వనుంది. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. గ్రేటర్ లో మొత్తం ఓటర్లు 74 లక్షల 4 వేల 286. అందులో పురుషులు 38 లక్షల 56 వేల 770, కాగా మహిళలు 35 లక్షల 46 వేల 847, ఇతరులు 669.
పోలింగ్ కేంద్రాలు 9248, గ్రేటర్ లో 150 వార్డులు. ఈ సారి బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ ఈ ఓటింగ్ కు ప్రవేశ పెట్టే అవకాశం కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నజేషన్ తో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్న ఈసీ స్పష్టం చేసింది.
గ్రేటర్ లో అతి పెద్ద డివిజన్ మైలార్ దేవులపల్లి 79 వేల 290 మంది ఓటర్లు కాగా, అతి చిన్న డివిజన్ రామచంద్రాపురం 27 వేల 948 మంది ఓటర్లు.